KRNL: దేవనకొండ PHCలో ల్యాబ్ టెక్నీషియన్ లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ నేతలు వైద్యాధికారికి ఇవాళ వినతి పత్రం అందజేశారు. ల్యాబ్ సిబ్బంది లేక పరీక్షలు ఆలస్యమవుతూ రోగులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. తక్షణమే పోస్టు భర్తీ చేయకపోతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.