PLD: అచ్చంపేట మండలం ఓర్వకల్లు గ్రామంలో శివాలయ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. మంగళవారం జరిగిన ముందస్తు పూజా కార్యక్రమాల్లో పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ముఖ్య అతిథిగా పాల్గొని, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వేడుకల్లో నియోజకవర్గ నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.