CTR: పుంగనూరు పట్టణంలోని మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం రేపు (శనివారం )ఉదయం 11 గంటలకు జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి శుక్రవారం తెలిపారు. మున్సిపల్ ఛైర్పర్సన్ అలీమ్ బాషా అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, అధికారులు తప్పక హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు.