PLD: విజయవాడ నుంచి అమరావతి వైపునకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. బస్సు ముందు టైరు పంచర్ కావడంతో రహదారి పక్కనే ఉన్న కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను అమరావతిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు.