CTR: చిత్తూరు టీడీపీ కార్యాలయంలో అధికార ప్రతినిధి వెంకిటీల సురేంద్ర కుమార్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమం, అభివృద్ధిలో ముందంజలో ఉందన్నారు. రెండు విడతల్లో 5.5 లక్షల ఇళ్లు పంపిణీ చేశామని, భారీ పెట్టుబడులతో ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. అమరావతి త్వరలోనే చట్టబద్ధ రాజధానిగా అవుతుందని స్పష్టం చేశారు.