E.G: నిడదవోలు RTC డిపో అభివృద్ధికి అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని RTC డిపో సాధన సౌకర్యాల పోరాట కమిటీ కన్వీనర్ జువ్వల రాంబాబు విమర్శించారు. గురువారం నిడదవోలులో ఆయన మాట్లాడుతూ నిడదవోలు డిపోలో 2006 సంవత్సరానికి ముందు 78 బస్సులు ఉండేవని కానీ ఇప్పుడు 34 బస్సులు మాత్రమే ఉన్నాయన్నారు. అందులో సగం కాలం చెల్లిన బస్సులు తిప్పుతున్నారన్నారని ఆయన పేర్కొన్నారు.