KRNL: అంబేడ్కర్ ఆశయాలను అనుసరిస్తూ సామాజిక న్యాయం సాధనలో ముందుకు సాగాలని ఆలూరు టీడీపీ ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి అన్నారు. ఇవాళ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆలూరులోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలతో ఘన నివాళులర్పించారు. దేవుడు జన్మనిస్తే.. అంబేడ్కర్ జీవించే హక్కును కల్పించారని స్పష్టం చేశారు. అంబేడ్కర్ ఆశయాలు సమాజానికి మార్గదర్శకమని పేర్కొన్నారు.