AKP: ప్రజలకు కనీస సదుపాయాలు కల్పించడానికి పంచాయతీ ప్రత్యేక అధికారులు ప్రాధాన్యత ఇవ్వాలని ఎమ్మెల్యే సుందరపు విజయ్ సూచించారు. ఇటీవల పంచాయతీలకు నియమించిన ప్రత్యేక అధికారులతో ఎమ్మెల్యే ఎలమంచిలిలో ఇవాళ సమావేశం నిర్వహించారు. త్వరలో అన్ని గ్రామాల్లోనూ పర్యటిస్తానని ఈలోగా ప్రజల అవసరాలను గుర్తించి వాటిని తీర్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.