ప్రకాశం: కనిగిరి మండలం తురకపల్లి గ్రామంలో పోషణ పక్వాడ కార్యక్రమాన్ని అంగన్వాడి కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. సూపర్వైజర్ మల్లీశ్వరి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గర్భిణీ స్త్రీలకు పోషకాహారం ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. సరైన ఆహారం తీసుకోవడం వల్ల బాలింతలు, శిశువుల ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు వారి శారీరక, మానసిక అభివృద్ధికి ఉపయోగపడుతుందని తెలిపారు.