E.G: గోకవరం (M) రంపయర్రంపాలెం గ్రామంలో ఆదివారం సాయంత్రం వేగంగా వచ్చిన ట్రాక్టరు రెండు విద్యుత్ స్తంభాలను ఢీకొట్టింది. ఈ ఘటనలో రెండు స్తంభాలు నేలకొరిగాయి. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న లైన్మెన్ వెంటనే ట్రాన్స్ఫార్మర్ నిలిపివేసి పెను ప్రమాదాన్ని తప్పించారు.