KRNL: పెద్దకడబూరు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని ఎంపీడీవో ప్రభావతి దేవి ఇవాళ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంగన్వాడీ కేంద్రానికి వచ్చే చిన్నారులతో మాట్లాడారు. అనంతరం చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు తయారు చేసిన భోజనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమే మాట్లాడుతూ.. ప్రభుత్వ రంగ నిబంధనలు మేరకు పౌష్టికాహారం సకాలంలో అందజేయాలని ఆదేశించారు. తప్పనిసరిగా సమయపాలన పాటించాలని సూచించారు.