ATP: తాడిపత్రికి చెందిన తొమ్మిదేళ్ల బాలుడు రతన్ తేజ్ రాష్ట్ర స్థాయి ఓపెన్ చెస్ పోటీలకు ఎంపికయ్యారు. అనంతపురంలో నిర్వహించిన జిల్లా స్థాయి అండర్-9 క్రీడా పోటీలలో విజేతగా నిలిచి సత్తా చాటినట్లు కోచ్ సురేంద్రనాథ్ పేర్కొన్నారు. తన కుమారుడు ప్రతిభ చాటి రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడం పట్ల తండ్రి శివకుమార్ హర్షం వ్యక్తం చేశారు.