WG: చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లును కాంగ్రెస్ మిత్రపక్షాలు వ్యతిరేకించి, తమ పతనానికి తామే నాంది పలికారని మంత్రి నిమ్మల రామా నాయుడు విమర్శించారు. పాలకొల్లులోని తన క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఆత్మీయ సదస్సు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జనాభాలో, ఓట్లలో సగం ఉన్న మహిళలు రాజకీయంగా ఎదగకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు.