TPT: పుత్తూరు పట్టణంలో పోలీసులు ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు. ఎస్సైలు నాగేంద్రబాబు, వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ పరిస్థితులను పరిశీలించారు. గంజాయి, జూదం, బెట్టింగ్, దొంగతనాలు వంటి అసాంఘిక కార్యకలాపాలపై కట్టుదిట్టమైన నిఘా పెట్టినట్లు తెలిపారు. బస్టాండ్, స్కూల్స్, కాలేజీలు, పార్కుల వద్ద పర్యవేక్షణ పెంచారు.