కృష్ణా: పెనమలూరు మండలంలోని గుంటుపల్లి వారి వీధి నుంచి ప్రసాదంపాడు వరకు రూ.1.3 లక్షల నిధులతో నిర్మించనున్న రహదారి నిర్మాణ పనులకు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే రాష్ట్రంలోని రోడ్లకు పూర్వ వైభవం తెచ్చేలా కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.