E.G: గ్రామీణ స్థాయి నుంచి ఆరోగ్య వ్యవస్థను నిరంతరం పర్యవేక్షించి ప్రతిష్ట పరచాలని, అప్పుడే అత్యవసర ప్రమాదాలను నివారించవచ్చని సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ కె.నారాయణ తెలిపారు. శనివారం రాజమండ్రిలో కల్తీ పాల వల్ల ప్రమాద బాధితులను పరామర్శించారు. కల్తీ పాల సంఘటనలో మరణించిన వారికి రూ.50 లక్షలు పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.