TPT: TTD ఈవోగా ముద్దాడ రవిచంద్ర ఇవాళ ఉదయం పూర్తి బాధ్యతలు స్వీకరించారు. ముందుగా కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలోని రంగనాయక మండపంలో అధికారికంగా బాధ్యతలు తీసుకున్నారు. అదనపు ఈవో వెంకయ్య చౌదరి, జేఈవోలు వీరబ్రహ్మం, శరత్ తదితర టీటీడీ అధికారులు రవిచంద్రకు స్వాగతం పలికి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.