మే 1 నుంచి జూన్ 11 వరకు టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్ కోర్సులో శిక్షణ ఇవ్వనున్నట్లు కాకినాడ జిల్లా విద్యాశాఖ అధికారి పిల్లి రమేశ్ తెలిపారు. సాలిపేట మున్సిపల్ గర్ల్స్ హైస్కూల్లో ఈ తరగతులు జరుగుతాయన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 26 లోగా www.bse.ap.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఉపాధ్యాయ వృత్తిలో సాంకేతిక నైపుణ్యం పెంపొందించుకోవచ్చన్నారు.