E.G: రాష్ట్రంలో దళిత సామాజికవర్గ మౌలిక నిర్మాణాన్ని దెబ్బతీసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని మాజీ MP హర్షకుమార్ తీవ్రంగా ధ్వజమెత్తారు. ఆకివీడు ఘటనలో అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి గురువారం విడుదలైన 10 మందిని ఆయన కలిసి సంఘీభావం ప్రకటించారు. ప్రజల సంక్షేమం కోసం పని చేయాల్సిన ప్రభుత్వం కుల, మతాల స్వేచ్ఛకు విరుద్ధంగా వ్యవహరిస్తుందని ఆయన ఆరోపించారు.