KRNL: పుడమిలోని ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టేద్దామని ఇరిగేషన్ శాఖ జేఈ సంజీవ్ కుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం పెద్దకడబూరు మండలం హెచ్ మురవణి, దొడ్డిమేకల, గంగులపాడులలో నీటి భద్రత – సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని 90 రోజుల పాటు నిర్వహిస్తుందన్నారు.