విజయనగరం జిల్లా డెంకాడ మండలం మోదవలస జంక్షన్ వద్ద ఇవాళ రోడ్డు ప్రమాదానికి గురైన వ్యక్తికి జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ దగ్గరుండి సపర్యలు చేయించి, చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మోదవలస జంక్షన్ వద్ద ప్రమాదాలు జరగకుండా నియంత్రణ చర్యలు చేపట్టాలని, వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు ఒక క్రమ పద్ధతిలో స్టాపర్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.