ASR: మహిళలు ఎక్కడయితే గౌరవించబడతారో అక్కడ సమాజం అభివృద్ధి చెందుతుందని చింతపల్లి ఎస్సైలు వీరబాబు, వెంకటరమణ అన్నారు. మహిళలు సమాజానికి మూల స్తంభాలన్నారు. ఆదివారం చింతపల్లిలో విద్యార్థులతో మహిళల భద్రతపై ర్యాలీ నిర్వహించారు. దేశంలో మహిళా రక్షణకు ప్రత్యేక చట్టాలు ఉన్నాయన్నారు. ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తించినా, వేధింపులకు పాల్పడినా ధైర్యంగా ఫిర్యాదు చేయాలన్నారు.