BPT: సంతమాగులూరులో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆదేశాల మేరకు ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ‘పోషణ పక్వాడా’ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో సీడీపీవో డీ. సుధా మాట్లాడుతూ.. గర్భిణులు, పిల్లల్లో పోషకాహార లోపాన్ని నివారించడమే ఈ ఉత్సవాల ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఆమెతో పాటు డాక్టర్ జోష్ణ, ఐసీడీఎస్ సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.