E.G: నిరుద్యోగ రహిత రాజమహేంద్రవరం సాధించడమే తమ లక్ష్యమని మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ అన్నారు. శనివారం మార్గాని ఎస్టేట్స్ నిర్వహించిన జాబ్ మేళాలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాబోయే మూడేళ్లలో పార్లమెంట్ పరిధిలోని 20 వేల మంది యువతకు ఉపాధి కల్పించడమే ధ్యేయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎంపికైన 500 మంది నిరుద్యోగులకు ఆయన నియామక పత్రాలను అందజేశారు.