ATP: గుత్తి 220 కేవీ విద్యుత్ ఉపకేంద్రంలో బుధవారం తెల్లవారుజామున హై వోల్టేజ్ కారణంగా 132 కేవీ సీటీ పేలడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో తెల్లవారుజామున 4 గంటల నుంచి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సమాచారం తెలుసుకున్న విద్యుత్ శాఖ అధికారులు సిటీలను మరమ్మతు పనులను చేపట్టారు.