VZM : స్థానిక నాగోజిపేట వద్దనున్న శ్రీ సంపత్ ఆంజనేయ స్వామి వారి ఆలయ 15వ వార్షికోత్సవం బుధవారం (రేపు) జరగనున్నట్లు ఆలయ ప్రతిష్టాపకులు ఇసరపు శేఖర్ యాదవ్ తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రేపు వేకువజాము నుంచి విశేషపూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మధ్యాహ్నం అన్నసమారాధనకు భక్తులందరూ పాల్గొనవలసిందిగా కోరారు.