ATP: గుంతకల్లులో శనివారం దినసరి సుంకం వసూలకు బహిరంగ వేలం పాట నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ లక్ష్మీదేవి మాట్లాడుతూ.. దినసరి, వారపు, జంతువదశాల నుంచి సుంకం వసూలకు బహిరంగ వేలం పాట నిర్వహించామన్నారు. ఈ వేలం పాటలో పత్తిపాటి చంద్రశేఖర్ నాయుడు అనే వేలం పాట దారుడు రూ.53,65,000 లక్షల బహిరంగ వేలం పాట పాడి సుంకం వసూలు చేసుకునే హక్కును దక్కించుకున్నారన్నారు.