KMM: కొణిజర్ల మండలం పల్లిపాడు బస్ స్టేజి ప్రాథమిక పాఠశాలలో నిర్వహించే ‘ఎవ్రీ చైల్డ్ రీడ్స్’ కార్యక్రమం అమలును ఇవాళ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ.. పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు ఇంగ్లీష్ భాష పరిజ్ఞానం మెరుగుపరిచి, రీడింగ్ స్కిల్స్ పెంపొందించాలని సూచించారు. ఉపాధ్యాయులు అందుకు అనుగుణంగా కృషి చేసి చేయాలని పేర్కొన్నారు.