MDK: మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లి గ్రామ చెరువులో పడి జార్ఖండ్ రాష్ట్రం సిద్ధిలీకి చెందిన సన్నీ కుమార్ (11) మృతి చెందినట్లు ఎస్సై సుభాష్ గౌడ్ తెలిపారు. శనివారం సాయంత్రం కాలకృత్యాలకు వెళ్లి చెరువు వైపు వెళ్లినట్లు తెలిపారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారి చెరువులో పడ్డాడు. స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించినట్లు వివరించారు.