GNTR: పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తల్లి నివాసంలో జరిగిన చోరీ కేసును పోలీసులు వారం రోజుల్లోనే ఛేదించారు. ఐదుగురు నిందితులను మంగళవారం అరెస్ట్ చేసి, రూ.69.25 లక్షల సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు రాకేష్పై ఇప్పటికే 35 కేసులు ఉన్నట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. సీసీ ఫుటేజ్, వేలిముద్రల ఆధారంగా నిందితులను పట్టుకున్నారు.