NTR: ఇబ్రహీంపట్నం మండలం ములపాడు గ్రామంలో వైసీపీ నియోజకవర్గ స్థాయి సంస్థాగత నిర్మాణ కమిటీ సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో మాజీమంత్రి యోగి రమేష్ మాట్లాడుతూ.. వైసీపీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేసి, పార్టీని గ్రామస్థాయి వరకు మరింత శక్తివంతంగా తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు,కార్యకర్తలు పాల్గొన్నారు.