PLD: చిలకలూరిపేట మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మన్, వైసీపీ నేత షేక్ అబ్దుల్లా టీడీపీలో చేరారు. మంగళవారం ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు సమక్షంలో కుటుంబ సమేతంగా ఆయన పసుపు కండువా కప్పుకున్నారు. అబ్దుల్లా చేరికతో పట్టణంలో పార్టీ బలపడుతుందని ప్రత్తిపాటి అన్నారు. ఎమ్మెల్యే చేసిన అభివృద్ధికి ఆకర్షితుడనై తాను పార్టీ మారానని అబ్దుల్లా తెలిపారు.