BPT: గవర్నర్ ఆదివారం బాపట్ల పట్టణంలో పర్యటించారు. ఆయన వ్యక్తిగత పర్యటన నిమిత్తం ఇక్కడికి విచ్చేసినట్లు స్థానిక అధికారులు తెలిపారు. గవర్నర్ రాక సందర్భంగా అధికారులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ మేరకు బాపట్ల ఎంఆర్వో షలీమా గవర్నర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు పుష్పగుచ్ఛం అందించి సాదరంగా ఆహ్వానించారు.