కోనసీమ: అరుదైన వ్యాధితో బాధపడుతున్న కర్నూలు జిల్లా వెల్దుర్తికి చెందిన రెండేళ్ల చిన్నారి పునర్వికకు పునర్జన్మ ఇవ్వాలని రామచంద్రపురం మండలం అన్నాయిపేటకు చెందిన చిన్నారులు మంగళవారం విరాళాలు సేకరించారు. చిన్నారికి రూ.16 కోట్లు విలువచేసే ఇంజక్షన్ అవసరమని తెలిసి విరాళాలు ప్రారంభించినట్లు తెలిపారు. ఇప్పటివరకు రూ.20 వేలు సేకరించామన్నారు.