కర్నూలు: వంద శాతం చెత్త సేకరణను సమర్థంగా నిర్వహించేందుకు ప్రజలు సహకరించాలని కార్పొరేషన్ కమిషనర్ పి.విశ్వనాథ్ ఇవాళ కోరారు. శానిటేషన్ ఇన్స్స్పెక్టర్, కార్యదర్శులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఇంటింటి చెత్త సేకరణ, చెత్త వాహనాల జీపీఎస్ ట్రాకింగ్పై సమీక్షించారు. నగరాన్ని గార్బేజ్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు కొనసాగుతున్నాయనిన్నారు.