ASR: బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు డా.నాగమానస అధికారులను ఆదేశించారు. సోమవారం పాడేరు కలెక్టరేట్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. పాఠశాల మధ్యలోనే చదువు మానేసిన విద్యార్థులను పాఠశాలలో చేరేలా ప్రోత్సహించాలన్నారు. పిల్లలను సోషల్ మీడియా దుష్ప్రభావం నుంచి దూరంగా ఉంచేలా అవగాహన కల్పించాలన్నారు.