VZM: కుంటినవలస గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన డి. విరాస్వామిని సోమవారం సాయంత్రం పాము కాటు వేయడంతో కుటుంబ సభ్యులు వెంటనే గజపతినగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ అతడు ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.