ప్రకాశం: పెరుగుతున్న విద్యుత్ ఖర్చులను తగ్గించుకోవడానికి ప్రజలు సోలార్ రూఫ్టాప్ యూనిట్లు ఏర్పాటు చేసుకోవాలని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు సూచించారు. ముక్తినూతలపాడు కాలనీలో పీఎం సూర్యఘర్ పథకం కింద ఏర్పాటు చేసిన సోలార్ యూనిట్లను ఆయన ప్రారంభించారు. ఒంగోలు నియోజకవర్గంలో ఈ పథకం అమలుకు రూ.31.18 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.