NLR: యుద్ధం కారణంగా వైజాగ్లో చిక్కుకుని ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ఇద్దరు ఇరాన్ మహిళలకు ఏపీ వర్ఫ్ బోర్డు రూ. 1.50 లక్షల ఆర్థిక సాయం అందించింది. బోర్డు ఛైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారికి ధైర్యం చెప్పి, నిధులను అందజేశారు. కష్టకాలంలో ఉన్న విదేశీయులకు కూటమి అండగా ఉంటుందని.. సీఎం చంద్రబాబు సహకారంతోనే నిధులు అందించామన్నారు.