KDP: పొద్దుటూరు శివాలయంలో జరిగిన దొంగతనంపై ఇవాళ జనసేన పార్టీ నాయకుడు మాదాసు మురళి 2టౌన్ సీఐ వంశీనాథ్కు ఫిర్యాదు చేశారు. శివాలయంలో స్వామివారికి చెందిన వెండి ఆభరణాలు మాయమయ్యాయని, అమ్మవారి బంగారు హారం స్థానంలో నకిలి హారాన్ని ఉంచారని ఆయన ఆరోపించారు. ఈ ఘటనపై విచారణ జరిపి, మాయమైన ఆభరణాలను రికవరీ చేయాలని, దోషులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.