BPT: శ్రీలంకలో జరిగే గోల్ షాట్ బాల్ పోటీలకు బాపట్ల విద్యార్థి ఎంపికయ్యాడు. మున్సిపల్ హైస్కూల్లో 9వ తరగతి చదువుతున్న గోదావరి మహిమ రాజు.. భారత జూనియర్ బాలుర జట్టు వైస్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. ఈ నెల 24 నుంచి 28 వరకు కొలంబోలో ఈ పోటీలు జరగనున్నాయి. అంతర్జాతీయ స్థాయికి ఎదగడం పట్ల అతడిని హెచ్ఎం, పీడీ కత్తి శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు అభినందించారు.