ప్రకాశం: టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెం జాతీయ రహదారి ఫ్లైఓవర్ బ్రిడ్జిపై మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. నెల్లూరు వైపు వెళ్తున్న కర్రల లారీని వెనక నుంచి కారు ఢీ కొట్టి, డివైడర్కు తగిలింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ అబ్దుల్ మానేన్ అనే యువకుడు మృతి చెందాడు. మృతుడు ఎన్టీఆర్ జిల్లా మైలవరం గ్రామానికి చెందిన వ్యక్తి. మృతదేహాన్ని రిమ్స్ హాస్పిటల్కి తరలించారు.