GNTR: అమరావతి హైకోర్టు సమీపంలో నిర్మించనున్న నూతన అగ్నిమాపక కేంద్రానికి ఫైర్ డీజీపీ వెంకటరమణ శంకుస్థాపన చేశారు. వేద మంత్రాల మధ్య భూమిపూజ నిర్వహించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. సుమారు 50 సెంట్ల విస్తీర్ణంలో ఈ కేంద్రాన్ని నిర్మించనున్నారు. ఆధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసే ఈ ఫైర్ స్టేషన్ అగ్నిప్రమాదాల నియంత్రణలో కీలకంగా ఉపయోగపడనుంది.