NLR: బుచ్చిరెడ్డిపాలెం పురపాలక సంఘం కార్యాలయంలో శనివారం ఉదయం 11 గంటలకు ఛైర్ పర్సన్ మోర్ల సుప్రజ మురళి అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం జరుగుతుందని నగర కమిషనర్ బాలకృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశంలో 15 అజెండాలు ప్రవేశపెడుతున్నామన్నారు. ఈ కార్యక్రమానికి కౌన్సిలర్లు కో ఆప్షన్ నెంబర్లు హాజరుకావాలని కోరారు.