కడప 2వ డివిజన్ వైఎస్సార్ కాలనీలో ఆదివారం నూతన రోడ్డు పనులకు ఎమ్మెల్యే మాధవి రెడ్డి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి భూమిపూజ చేశారు. నగరంలో నాణ్యమైన రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ కల్పనే తమ లక్ష్యమని వారు తెలిపారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని పనులను త్వరగా, నాణ్యంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.