W.G: స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న ఏఎన్ఎంల పనితీరు, విధివిధానాలపై అధికారులు స్పష్టతనివ్వాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మోహనరావు డిమాండ్ చేశారు. బుధవారం భీమవరం ఎస్పీ స్ట్రీట్ యూపీహెచ్సీలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏఎన్ఎంలను వారి మాతృశాఖ అయిన వైద్య ఆరోగ్య శాఖలోనే విలీనం చేయాలన్నారు.