GNTR: రాబోయే ఎన్నికల్లో 100% విజయం సాధించడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమా పిలుపునిచ్చారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన క్లస్టర్ ఇంఛార్జ్ల శిక్షణా తరగతుల కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పార్టీ పటిష్ఠతకు శక్తివంచన లేకుండా ప్రతి నాయకుడు, కార్యకర్త కృషి చేయాలన్నారు.