ELR: ముసునూరులో ఇళ్ళు అగ్నికి ఆహుతైన ఘటనలో బాధితులకు అట్లూరి చారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ వెంకట రవీంద్ర బుధవారం ఆర్థిక చేయూత అందించారు. నిత్యవసర సరుకులు,10 వేల రూపాయల నగదును అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ టీడీపీ అధ్యక్షులు గార్లపాటి నరసింహారావు, నియోజకవర్గ ఎస్సీ సెల్ నేత కొండేటి ఉదయ్ కిరణ్, చీలి అర్లప్ప, లక్కపాము కాంతారావు పాల్గొన్నారు.