KRNL: రాష్ట్ర సచివాలయంలో ఈ నెల 29న ఏపీ క్యాబినెట్ సమావేశం జరగనుంది. ఉదయం 10:30 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి మంత్రులు ఎన్ఎండి ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డి, టీజీ భరత్ గుప్తా హాజరుకానున్నారు.