PLD: నరసరావుపేటలో జనసేన పార్టీ కార్యాలయంలో బుధవారం కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ జనసేన నేతలతో సమావేశమయ్యారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. నియోజకవర్గ వ్యాప్తంగా జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమాలను చురుగ్గా నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు.